భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలి...!! భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలని ధర్మ సమాజ్ పార్టీ యాదాద్రి భునగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల అధ్యక్షులు కొప్పు సంజీవ్ డిమాండ్ చేశారు. ధర్మసమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు తాము ప్రభుత్వానికి నివేదించిన ప్రతిపాదన నమునా చిత్రాన్ని ఆమోదించాలని శుక్రవారం నారాయణపురం మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు. *ధర్మసమాజ్ పార్టీ నమూనా ప్రతిపాదన చిత్రంలో రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్, ఉస్మానియా యూనివర్సిటీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పండగ సాయన్న, మరియు సమ్మక్క సారలక్క చిత్రాలు ఉన్నాయని తెలిపారు. అణగారిన వర్గాల పోరాట యోధుల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ మహనీయులను చిహ్నంలో పొందుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొప్పు సంజీవ్, మండల నాయకులు జలంధర్, సాయికుమార్, సందీప్, నగేష్ ,నవీన్, మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment