Skip to main content

Posts

Showing posts from June, 2024

Santh Kabir Das Jayanthi

 దృక్ పంచాంగ్ ప్రకారం, జూన్ 22న, శుక్ల పక్షం యొక్క పూర్ణిమ మరియు ప్రతిపాద తిథిని ఆచరిస్తారు. ఈ రోజున ప్రజలు కబీర్‌దాస్ జయంతిని జరుపుకుంటారు. సంత్ కబీర్దాస్ భారతదేశంలో ప్రసిద్ధ కవి, సాధువు మరియు సంఘ సంస్కర్త. ఆయన రచనలు భక్తి ఉద్యమంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి

World music day

  అంతర్జాతీయ సంగీత దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. 1982లో ఫ్రాన్స్‌లో మొదటిసారిగా ప్రారంభించబడిన ఈ దినోత్సవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం ప్రధానంగా సంగీతం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక ప్రభావాలను గుర్తించి, అన్ని రకాల సంగీతాన్ని ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ సంగీత దినోత్సవం ప్రాముఖ్యత సంగీతానికి గౌరవం: సంగీతం అందించే ఆనందం మరియు ప్రశాంతతను గుర్తించడం. సామాజిక ఐక్యత: సంగీతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకటిగా కట్టిపడేస్తుంది. సృజనాత్మకత ప్రోత్సాహం: కొత్త సంగీత ప్రతిభలను ప్రోత్సహించడం మరియు వారికి ప్రదర్శన అవకాశాలను కల్పించడం. సాంస్కృతిక మార్పిడి: వేరువేరు సంస్కృతుల మధ్య సంగీతం ద్వారా పరస్పర అవగాహన మరియు గౌరవాన్ని పెంపొందించడం.

International Yoga Day

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలి...!!

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో  రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలి...!! భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలని ధర్మ సమాజ్ పార్టీ యాదాద్రి భునగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల అధ్యక్షులు కొప్పు సంజీవ్ డిమాండ్ చేశారు. ధర్మసమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు తాము ప్రభుత్వానికి నివేదించిన ప్రతిపాదన నమునా చిత్రాన్ని ఆమోదించాలని శుక్రవారం నారాయణపురం మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు. *ధర్మసమాజ్ పార్టీ నమూనా ప్రతిపాదన చిత్రంలో రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్, ఉస్మానియా యూనివర్సిటీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పండగ సాయన్న, మరియు సమ్మక్క సారలక్క చిత్రాలు ఉన్నాయని తెలిపారు. అణగారిన వర్గాల పోరాట యోధుల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ మహనీయులను చిహ్నంలో పొందుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొప్పు సంజీవ్, మండల నాయకులు జలంధర్, సాయికుమార్, సందీప్, నగేష్ ,నవీన్, మధు తదితరులు పాల్గొన్నారు.