ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో లో.. సంక్షేమ హాస్టల్స్ లో ఆత్మహత్య లు చేసుకున్న 'వైష్ణవి,భవ్య మరియు దగ్గుబాటి వైష్ణవి' ల సంఘటనల పై ప్రభుత్వం విచారణ జరపాలి,దోషులను వెంటనే శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ.. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ సంస్థాన్ నారాయణపురం మండల నాయకులు సంజీవ్, జలంధర్, సాయి, నగేష్, శివాజీ, నాగరాజ్, సాయి కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు..