తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణాన్ని హెతుబద్దంగా సవరించాలి అని తెలియజేస్తూ మండల MRO కార్యాలయంలో వినతి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణాన్ని హెతుబద్దంగా సవరించాలి అని తెలియజేస్తూ
ధర్మ సమాజ్ పార్టీ - సంస్థాన్ నారాయణపురం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల MRO కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల కన్వీనర్ కొప్పు సంజీవ్ గారు మాట్లాడుతూ డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ ఉచిత ప్రయాణంలో చాలా అనర్ధాలు, నష్టాలు ఉన్నాయని అందుకని హేతుబద్ధంగా ఈ ఉచిత ప్రయాణాన్ని సవరించాలని తెలియ జేస్తూ...
🔷 1.ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద మహిళలకు మాత్రమే అవకాశం కల్పించాలని తెలియజేశారు. దీనివల్ల ధనవంతులైన మహిళల ఉచిత ప్రయాణాన్ని నియంత్రించవచ్చని తెలిపారు.
🔷 2. నెలకు రూ.లక్ష సంపాదించే మహిళా ఉద్యోగస్తుల ఉచిత ప్రయాణాన్ని నియంత్రించవచ్చని సూచించారు. అదే ఆర్టీసీ బస్సులలో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలైన ఇంటిని పోషించే పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు.
🔷 3.ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత ప్రయాణం ప్రభావం ఆటో కార్మికులపై పడుతుందని, తద్వారా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నష్టాన్ని భరించడానికి ఆటోనడిపే కార్మికులందరికీ నెలకు రూ.3000 చొప్పున ఆర్ధిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణాన్ని ఈ విధంగా సంస్కరించి, సవరించి అన్ని వర్గాలకు మేలు చేకూర్చే పథకంగా సరిచెయ్యాలని ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు.
Comments
Post a Comment